YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుప్రీం సంక్షోభంపై స్పందించినత ప్రధాని

సుప్రీం సంక్షోభంపై స్పందించినత ప్రధాని

సుప్రీం కోర్టు సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఆ వివాదాన్ని న్యాయవ్యవస్థే తనకు తానుగా పరిష్కరించుకోగలదని అన్నారు. న్యాయవ్యవస్థలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోరాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.  ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. సుప్రీం కోర్టులో తలెత్తిన వివాదాన్ని న్యాయవ్యవస్థ పరిష్కరించుకోగలదన్న విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు. ‘‘నేను ఈ చర్చకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవద్దు. రాజకీయ పార్టీలూ ఆ అంశానికి దూరంగా ఉండాలి. దేశ న్యాయవ్యవస్థకు మంచి పేరుండేది. వారంతా సమర్థులు. వారి సమస్యలకు వారే పరిష్కారం కనుక్కోగలరు’’ అని ఆయన అన్నారు. 

Related Posts