YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

పీసీబీలో మళ్లీ కరోనా కలకలం

 పీసీబీలో మళ్లీ కరోనా కలకలం

లాహోర్, జూలై 17,
పాకిస్థాన్ క్రికెట్ జట్టుని కరోనా వైరస్ వీడటం లేదు. ఇంగ్లాండ్ టూర్‌ కోసం గత నెలలో 29 మందితో కూడిన జట్టుని ప్రకటించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. క్యాంప్‌కి ముందు కరోనా వైరస్ పరీక్షలు చేయగా.. అందులో ఏకంగా 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే.. ఈ 10 మందిలో మహ్మద్ హఫీజ్ పర్సనల్‌గా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోగా నెగటివ్ రావడంతో.. అదే విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దాంతో.. పీసీబీ కూడా అతనికి మూడు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పరీక్షలు నిర్వహించగా.. ఆఖరికి నెగటివ్‌గా తేలింది. దాంతో.. మొత్తంగా.. 20 మంది క్రికెటర్లని ఇంగ్లాండ్ టూర్‌కి మొదట పీసీబీ పంపింది.కరోనా పాజిటివ్‌గా ఉన్న 9 మంది క్రికెటర్లలో.. హైదర్ అలీ, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి‌లకి ఇటీవల నెగటివ్ రావడంతో.. వారిని ఇంగ్లాండ్‌కి పంపింది. కానీ.. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ ముగ్గురికీ పరీక్షలు చేయగా.. ఇందులో ఆల్‌రౌండర్ కాశీఫ్ భట్టీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో.. భట్టీని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఈసీబీ ఆదేశించింది. వాస్తవానికి ఈ ముగ్గురు క్రికెటర్లని ఇంగ్లాండ్‌కి పంపే ముందు రెండు సార్లు పీసీబీ పరీక్షలు నిర్వహించగా.. రెండింటిలోనూ నెగటివ్ అని తేలింది. కానీ.. మళ్లీ ఆల్‌రౌండర్‌కి పాజిటివ్‌గా రావడంతో.. పీసీబీ తల పట్టుకుంది.
ఆగస్టు 5 నుంచి ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్ మొత్తాన్ని పూర్తి బయో-సెక్యూర్ వాతావరణంలో ఈసీబీ నిర్వహించబోతోంది. ఈ కారణంగానే నెల రోజుల ముందే అక్కడికి పాక్ టీమ్‌ని రప్పించిన ఈసీబీ.. 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచింది. అలానే సిరీస్‌కి ముందు ఇరు జట్ల ఆటగాళ్లకి కరోనా పరీక్షలు నిర్వహించి.. నెగటివ్ అని తేలితేనే.. ఆటలోకి అనుమతించనున్నారు.

Related Posts