నెమళ్లు మృతి
యాదాద్రి భువనగిరి
జిల్లాలోని బొమ్మలరామరం ప్యారారం గ్రామ పరిధి శామీర్ పేట్ వాగులో ఆరు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమికంగా చుట్టూ ఉన్న రైతులు, వారి పంట పొలాల్లో ఎరువుల పరిమాణాన్ని పరిశీలించారు. పొలాల్లోని నీటిని తాగడం, ఆ పంట పొలాల్లో ఆహారం తీసుకోవడంతోనే నెమళ్లు మరణించాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
=======================xx