YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గ్యాస్ సిలెండర్ సబ్సిడీలు ఆగిపోయాయి

గ్యాస్ సిలెండర్ సబ్సిడీలు ఆగిపోయాయి

గ్యాస్ సిలెండర్ సబ్సిడీలు ఆగిపోయాయి
ముంబై, 
మీరు ఈ మధ్యన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా? అయితే మీకు సబ్సిడీ డబ్బులు వచ్చాయో.. లేదో చెక్ చేసుకున్నారా? అయితే మీకు వచ్చి ఉండవు. గత మూడు నెలలుగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సబ్సిడీ డబ్బులు రావడం లేదు. ఈ విషయం చాలా మంది గమనించి ఉండరు.2020 మే నెల నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన వారికి సబ్సిడీ డబ్బులు అందడం లేదు. బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు జమ కాలేదు. మే నెల నుంచి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను నిలిపివేసింది. దీంతో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల బ్యాంక్ అకౌంట్లలోని ఈ సబ్సిడీ డబ్బులు రావడం లేదు.మోదీ సర్కార్ ఇలా ఎందుకు చేసిందో ఒకసారి చూద్దాం. గత ఏడాది కాలంలో సబ్సిడీ లేనటువంటి గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతూ వచ్చింది. అదేసమయంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు సబ్సిడీ సిలిండర్, సబ్సిడీ లేనటువంటి సిలిండర్ ధర దాదాపు సమానంగానే ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని బంద్ చేసింది.ఇకపోతే కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి కుబుంబానికి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్లకు ఇది వర్తిస్తుంది. ఏడాదిలో ఈ లిమిట్ దాటిపోతే అప్పుడు సబ్సిడీ మొత్తం రాదు. సిలిండర్ ధర ఎంత ఉందో అంతే చెల్లించాలి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

Related Posts