పల్లె ప్రకృతి వనాలు ఆక్సిజన్ పార్కులు ప్రగతికి సోపానాలు
ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్
మావల మండలంలోని వాగపూర్ గ్రామంలో రూ.3.84 లక్షలతో ఏర్పాటు చేయనున్న పల్లె ప్రకృతి వనానికి శుక్రవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ప్రకృతి వనాలను అన్ని గ్రామాల్లో చేపడుతున్నాం అని ప్రజలకి ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందిండం లో ఈ ప్రకృతి వనాలు ముఖ్యభూమిక పోషిస్తాయన్నారు,
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని హరితహారం లో భాగస్వాములు కావాలని, ప్రజలందరూ హరిత సైనికునిలా పని చేయాలని కోరారు,
తెలంగాణ ప్రభుత్వం ద్వారా క్లస్టర్ల వారీగా రైతువేధికలను నిర్మిస్తున్నామని, ఈ వేదిక ద్వారా రైతులయొక్క అన్ని కార్యక్రమాలు చేపడతారని తెలియపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబందు, భీమా, సరైన సమయానికి విత్తనాలను సమకూర్చడం గ్రామాలలోని వెళ్లి పంటలను కొనుగోలు చేసి రైతులకు అన్నివిధాల ఆదుకుంటున్న రైతు ప్రభుత్వం దేశంలో ఇదొక్కటే అన్నారు,
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటీకినీ రైతులకు అండగా నిలిచి అన్ని కార్యక్రమాలు చేపట్టామని తెలియపరిచారు. కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ ఆరె రాజన్న , మార్కెట్ చైర్మన్ ప్రహల్లాద్, జిల్లా రైతు సమన్వయ అడ్డి బోజారెడ్డి , జడ్పీటిసి నల్లా వనిత, ఎంపీపీ చందాల ఈశ్వరీరాజన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి,తహశీల్దార్ వనజా రెడ్డి, ఎంపీడీఓ అరుణ, నాయకులు, బాపురావు, చాకటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు