YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గిరిజనమహిళ హత్యకేసులో ఒకరు ఆరెస్టు

గిరిజనమహిళ హత్యకేసులో ఒకరు ఆరెస్టు

గుంటూరు
అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ రెడ్డిని గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.గుంటూరు జిల్లా శివాపురం తండాలో అప్పలు చెల్లించలేదనే నెపంతో మంత్రుభాయిని శ్రీనివాస్ రెడ్ ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మృతురాలి బందువులు ఆందోళనకు దిగారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. నకరికల్లు మండలంలోని నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాస్ రెడ్డి వద్ద పొలాన్ని తాకట్టు పెట్టి 3.90 లక్షలను మంత్రుభాయి దంపతులు మూడేళ్ల క్రితం అప్పు తీసుకొన్నారు. అయితే వడ్డీతో సహా అప్పును చెల్లించాలని మంత్రుబాయ్ దంపతులను శ్రీనివాస్ రెడ్డి కోరాడు. అయితే ఇప్పుడే డబ్బులు చెల్లించలేమని గిరిజన దంపతులు చెప్పారు. అయితే పొలాన్ని స్వాధీనం చేసుకొంటానని శ్రీనివాస్ రెడ్డి బెదిరించారు.ఈ క్రమంలోనే కొంత కాలంగా అప్పు చెల్లించాలని శ్రీనివాస్ రెడ్డి కోరాడు. కానీ  మరోసారి ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.ఈ క్రమంలో పొలంలో పనులు చేసుకొంటున్న మంత్రూబాయిపై శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్ ను ఢీకొట్టి చంపాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీనిపై విచారణ కోనసాగుతున్న క్రమంలో శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Related Posts