YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ట్రాక్టర్ పట్టివేత

ట్రాక్టర్ పట్టివేత

నెల్లూరు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. చిట్టమూరు మండల పరిధిలోని రొయ్యల వాగు   నుంచి  ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా వా కాడు మండలం లోని వాలమెడు  గ్రామానికి అక్రమంగా  నాలుగు న్నర టన్నుల ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను  బుధవారం మల్లాo వద్ద ఎన్ ఫోర్స్ మెంట్ స్పెషల్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఎస్సై వి.శశి కుమార్,సిబ్బంది   పట్టుకున్నారు.  గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌ బందిల రవి ను పట్టుకొని అతనిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్ ను చిట్ట మూరు పోలీసు స్టేషన్ కు తరలించడం జరిగిందని సి ఐ శ్రీధర్ బాబు విలేకర్లకు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేయడం నేరమని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన  హెచ్చరించారు.ఈ దాడుల్లో సిబ్బంది ఈ. రమణయ్య, ఎస్.మోహన్,పి.పి కోటయ్య, తదితరులు ఉన్నారు.

Related Posts