YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

మోడీకి జగన్ రిక్వెస్ట్

మోడీకి జగన్ రిక్వెస్ట్

న్యూఢిల్లీ, ఆగస్టు 11
రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర సహాయ సహకారాలు అందించాలని కోరారు ఏపీ సీఎం వైఎస్ జగన్. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహానగరాలు తమకు లేవని.. ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవన్నారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. కరోనా నివారణ చర్యలపై పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటూ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 25లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని తెలిపారు. ప్రతి పది లక్షల మందికి 47,459 పరీక్షలు నిర్వహించామన్నారు. మరణాలు రేటు 0.89 శాతంగా ఉందని.. క్లస్టర్లలోనే 85 నుంచి 90శాతం వరకూ పరీక్షలు చేస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా పాజిటివ్‌ కేసులను గుర్తిస్తున్నామని.. ఇలా చేయడం వల్ల మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందన్నారు. కోవిడ్‌ వచ్చే నాటికి వైరాలజీ ల్యాబ్‌ కూడా లేదని, ఇప్పుడు ప్రతి పది లక్షల మందికి 47 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నామని వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల మంది వాలంటీర్లు కోవిడ్‌ నివారణా చర్యల్లో ఉన్నారని.. అవసరమైన అందరికి టెస్టులు చేస్తున్నామని, ప్రతి రోజు 9వేల నుంచి 10వేల కేసులు నమోదువతున్నాయని తెలిపారు. 138ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నామని.. రాష్ట్రంలో 109కోవిడ్‌కేర్‌ సెంటర్లు, 56వేలకుపైగా బెడ్లు ఉన్నాయన్నారు. రాష్టంలో 11 వేలకుపైగా ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయని వివరించారు. ప్రతి మండలంలో 108అంబులెన్స్‌ ఉన్నాయని, కోవిడ్‌కు ముందు 108అంబులెన్స్‌ వాహనాలు 443ఉంటే, కోవిడ్‌ సమయంలో మరో 768అంబులెన్స్‌లు సమకూర్చుకున్నామన్నారు

Related Posts