YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా కట్టడిపై హైకోర్టు ప్రశంసలు

కరోనా కట్టడిపై హైకోర్టు ప్రశంసలు

హైద్రాబాద్, ఆగస్టు 13 
కరోనా కట్టడి విషయంలో ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడిన హైకోర్టు గురువారం నాటి విచారణ సందర్భంగా ప్రశంసలు గుప్పించింది.కరోనా వైరస్‌ను అరికట్టే విషయమై తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగానికి హైకోర్టు కితాబిచ్చింది. రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రీట్మెంట్ విషయమై గురువారం విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు జరుపుతున్న తీరు, పాజిటివ్ వచ్చిన వారికి అందిస్తోన్న చికిత్స గురించి ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది.ఆగస్టు 3 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 42 వేల మంది సెంకడరీ కాంటాక్టులకు కరోనా టెస్టులు చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం ప్రభుత్వ యంత్రాంగానికి కితాబిచ్చింది. గతంలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేయడంపై స్పందిస్తూ.. దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడం కోసమే తాము ప్రయత్నించామని, అంతేగానీ విమర్శలు చేయాలనేది తమ ఉద్దేశం కాదని న్యాయస్థానం తెలిపింది.చిన్న చిన్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశామని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా యోధులు తమ వ్యాఖ్యాలను అపార్థం చేసుకోవద్దని సూచించింది. కరోనాపై పోరాడుతున్న అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని తెలిపింది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే ఉద్దేశంతోనే సూచనలు చేశామని స్పష్టం చేసింది.మరోవైపు ప్రయివేట్ హాస్పిటళ్లు కరోనా చికిత్స కోసం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ హాస్పిటళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
 హైకోర్టు ఆదేశాలు అమ‌లు చేశారా లేదా అని ప్ర‌శ్నించ‌గా..కరోనా ప‌రీక్ష‌లు ఎక్కువ‌గా చేస్తున్నామ‌ని సీఎస్ బ‌దులిచ్చారు. ఇప్ప‌టికే 50 ప్రైవేటు ఆసుపత్రుల‌కు ప్ర‌భుత్వం  నోటీసులు ఇచ్చింద‌ని పేర్కొన‌గా..మ‌రి మిగిలిన హాస్పిట‌ల్స్ ప‌రిస్థితి ఏంట‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది.  అపోలో, బసవతారకం  వంటి హాస్పిటల్స్ పై  ప్ర‌భుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తి వివరాలతో త్వ‌ర‌లోనే బులిటెన్‌ విడుదల చేస్తున్నామని  సీఎస్ సోమేష్‌కుమార్ కోర్టుకు వివ‌రించారు. ఇక రాష్ర్టంలో 8వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో  పిటీషన్ దాఖలు అయ్యింది. గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించడాన్ని సవాలు చేసిన ఉద్యోగులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005 యాక్ట్ ప్రకారం పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను ఇటీవ‌లె తొలిగించారు. పెండిండ్‌లో ఉన్న జీతాల‌ను తిరిగి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిష‌నర్లు కోర్టుకు విన్న‌వించుకున్నారు. ఈ పిటిష‌న్‌పై  హెకోర్టులో  విచార‌ణ కొన‌సాగుతుంది

Related Posts