YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సాహిత్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు శుభవార్త

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు శుభవార్త

చెన్నై ఆగస్టు  27 
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్పృహలోకి వచ్చారని, ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతూ ఉందని చల్లటి కబురు చెప్పారు. ప్రస్తుతం చికిత్సకు ఆయన సహకరిస్తున్నారని తెలుపుతూ ఓ హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు.  బాలు శ్వాసక్రియ మెరుగుపడిందని వెల్లడించిన వైద్యులు, ఇదే విధంగా నిలకడైన పరిస్థితి ఉంటే, వారం రోజుల్లోనే ఆయనకు అమర్చిన ఎక్మో పరికరాన్ని తొలగిస్తామని అన్నారు. కాగా, కరోనా సోకిన పరిస్థితుల్లో ఎంజీఎం ఆసుపత్రిలో బాలు చేరగా, ఆపై ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఎంజీఎం హాస్పిటల్ ఐసీయూ కింది అంతస్తులో వేద పండితులు నిత్యమూ వేద పారాయణం చేస్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని బాలూకు చికిత్స చేస్తున్న గదిలో ఉన్న టీవీలో లైవ్ వచ్చే ఏర్పాటు చేశారు.

Related Posts