YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

భర్తకు కరోనా.. రాసలీలలో భార్య

భర్తకు కరోనా.. రాసలీలలో భార్య

కాకినాడ, ఆగస్టు 28
భర్తకి కరోనా సోకిందన్న బాధ ఉందో.. లేదో కానీ మరొకరితో రాసలీలలకు రెడీ అయిపోయిందో భార్య. రోజూ ఇంటికి వచ్చి పండ్లు ఇచ్చి వెళ్తున్న వ్యక్తితో వివాహేతర సంబంధం  పెట్టుకుంది. తీరా ఆ విషయం భర్తకి తెలిసిపోవడంతో ప్రియుడితో కలసి కట్టకున్నోడిపైనే దాడి చేసి తీవ్రంగా కొట్టింది. ఈ అమానుష ఘటన తూర్పు గోదావరి జిల్లాలో  చోటుచేసుకుంది.కాకినాడ పాతబస్టాండ్ సెంటర్ న్యూ వెంకటేశ్వర కాలనీకి చెందిన శ్రీనివాస్(పేరు మార్చాం)కి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన ఐసోలేషన్‌లో  ఉండడంతో అన్నమ్మఘాటీ ఏరియా రెల్లి కాలనీకి చెందిన జె.రాజేష్ రోజూ పండ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడు. నిత్యం ఇంటికి వచ్చి వెళ్తుండడంతో శ్రీనివాస్ భార్య సునీత (పేరు  మార్చాం)తో రాజేష్‌కి పరిచయమైంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగించేవారు.తీరా ఆ విషయం భర్తకి తెలిసిపోవడంతో కథ  అడ్డం తిరిగింది. తన ఇంటికి వచ్చిన రాజేష్‌తో భర్త గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో అతని భార్య ప్రియుడికే వంతపాడింది. అంతటితో ఆగని  ఆమె.. ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తపైనే చేయిచేసుకుంది. స్పందించిన స్థానికులు వెంటనే భర్తని జీజీహెచ్‌కి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్  స్టేషన్‌లో కేసు నమోదైంది.

Related Posts