YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అనుమానం పెనుభూతం…భార్యను హతమార్చిన భర్త

అనుమానం పెనుభూతం…భార్యను హతమార్చిన భర్త

అనంతపురం ఆగస్టు 29, 
 అనంతపురం జిల్లా పామిడి మండలం ఓబులాపురం గ్రామం లో దారుణం చోటుచేసుకుంది. భార్య చౌడమ్మ ను భర్త శ్రీనివాసులు కత్తితో పొడిచి హత్య చేశాడు.  ఓబులాపురం గ్రామానికి చెందిన  చౌడమ్మ తో గుంతకల్లు పట్టణం లోని అంకాలమ్మ వీధికి చెందిన శ్రీనివాసులకి ఇచ్చి10 సంవత్సరాల క్రితం పెద్దలు వివాహం జరిపించారు. వీరి పదేళ్ల కాపురానికి ఇద్దరు సంతానం. భార్యపై భర్త అనుమానం పడేవాడు.  లాక్ డౌన్ సమయంలో శ్రీనివాసులకు పనులు లేక ఇంటి వద్దే ఉండేవాడు ఆ సమయంలో శ్రీనివాసులు తాగుడుకు బానిసయ్యాడు. పుట్టుగా మద్యం సేవించి భార్యతో తరచు గొడవ పడేవాడు. మద్యం మత్తులో రెండు, మూడు సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. భర్త వేధింపులు తాళలేక చౌడమ్మ ఇద్దరు పిల్లల్ని వెంటబెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను హతమార్చాలని కుట్ర పన్నాడు శ్రీనివాసులు. అయితే శుక్రవారం అర్ధరాత్రి శ్రీనివాసులు అత్తగారి  ఇంటికి వచ్చి తన భార్యను తనతో పంపించాలని ఇక నుంచి మంచిగా చూసుకుంటానంటూ నమ్మబలికాడు. ఉదయాన్నే వెళ్ళాలని అత్త,భార్య  తో చెప్పడంతో సరేనంటూ నిద్రపోతుయారు.అర్థరాత్రి సమయంలో భార్యతో గొడవ పడ్డాడు తన వెంట తెచ్చుకున్న కత్తితో చౌడమ్మ పై విచక్షణ రహితంగా దాడి చేసాడు. చౌడమ్మ కేకలు వేయడంతో తల్లి అడ్డుగా రావడంతో ఆమెపై కూడా కత్తితో దాడి చేసి పారిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చౌడమ్మ ను పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చౌడమ్మ మృతి చెందింది. గాయాలపాలైన అత్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాసులు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన శ్రీనివాసులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Related Posts