YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కరోనా వీర విహారం

 ఏపీలో కరోనా వీర విహారం

విజయవాడ, ఆగస్టు 31 
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు 75వేలకు పైగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఆదివారం ఒక్క రోజే 78,761 వచ్చాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఒకేరోజు 16,286 కేసులు వచ్చాయి. సోమవారం నాటికి ఆంధ్రప్రదేశ్‌ కేసుల సంఖ్యలో దేశంలో రెండో స్థానానికి చేరుకోనుంది. 75వేలకుపైగా కేసులు నమోదు కావడం వరుసగా ఇది నాలుగోరోజు. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత వారంతో పోలిస్తే గడచిన వారంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఢిల్లీ, ఒడిశా, తెలంగాణల్లో కేసులు పెరిగాయి.ఇటు రోజువారీ అత్యధిక కేసులు వస్తున్న టాప్‌-10 జిల్లాల్లో 5 మహారాష్ట్రలో ఉండగా.. ఏపీ నుంచి తూర్పుగోదావరి, నెల్లూరు ఇందులో ఉన్నాయి. టాప్‌-15లో కడప, విశాఖ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాలు. టాప్‌-30లో చిత్తూరు, కర్నూలు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి. టాప్‌-30 జిల్లాల్లో ఏపీలోని 12 జిల్లాలు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 43.08% ఈ 30 జిల్లాల్లోనే నమోదయ్యాయి. మరోవైపు ఇదివరకు ఎన్నడూలేని విధంగా ఐసీఎంఆర్‌ ఒక్క రోజులో 10,55,027 పరీక్షలు నిర్వహించింది.ఇక సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లు ప్రారంభమైన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన మొదలైంది. కొన్ని రాష్ట్రాల్లో వలస కార్మికుల మళ్లీ పనుల వేటలో పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారు. దీంతో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే దీపావలి నాటికి కరోనా ప్రభావం తగ్గుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

Related Posts