YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

మరో మంత్రికి కరోనా

మరో మంత్రికి కరోనా

మరో మంత్రికి కరోనా
విజయవాడ, 
ఆంధ్రప్రదేశ్‌‌లో మరో మంత్రికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. రాష్ట్ర పంచయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సామాన్యుల వరకు కరోనా మహమ్మారి దాడి చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు గత వారం రోజులుగా 10 వేలకు పైగా నమోదవుతున్నాయి. సోమవారం కూడా 56,490 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10,004 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 4,34,771కు పెరిగాయి.అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా పెరుగుతున్నాయి. సోమవారం కరోనా మరణాలు 85కు పెరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా 
వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,969కు పెరిగింది. ఇక రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కరోనా వైరస్ మహమ్మారి బారినపడ్డారు. అలాగే మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌లకు కూడా కరోనా సోకింది. తాజాగా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Related Posts