YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆస్తి-పాస్తులు దేశీయం

రియ‌ల్ శ్రీ మంతుడు చెన్నై, 

రియ‌ల్ శ్రీ మంతుడు చెన్నై, 

రియ‌ల్ శ్రీ మంతుడు
చెన్నై, 
తమిళనాడుకు చెందిన అతి సాధారణ కుటుంబంలో జన్మించిన శ్రీధర్ వెంబు.. ఐఐటీ, మద్రాస్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ సిలికాన్ వ్యాలీలోసాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించారు. దానికి సీఈవోగా వ్యవహరిస్తున్న ఆయన.. ఇప్పుడు అవన్నీ వదిలేసి స్వగ్రామానికి వచ్చేశారు.భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన ఎంతో విలువనిస్తారు. కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినా.. సాదాసీదా షర్టు, తెల్లని లుంగీ ధరించి గ్రామానికి చెందిన పిల్లలలో ఆయన కలిసిపోయిన తీరు చూస్తే.. ఆయన ఎంతటి నిరాడంబరుడో ఇట్టే అర్థమవుతుంది.మాథాలంపరై గ్రామ వీధుల్లో పిల్లలతో కలిసి సైకిల్‌పై తిరుగుతున్నారు.పేద పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలనేది శ్రీధర్ లక్ష్యం. లాక్‌డౌన్‌లో ప్రయోగాత్మకంగా ఆయన ముగ్గురు చిన్నారులను చేరదీసి పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 25 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లకు చేరింది. ఆ విద్యార్థులందరికీ ఉచితంగా ఆహారం అందిస్తూ తరగతులు చెప్పిస్తున్నారు.ఆవిధంగా ఆయన తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని భావిస్తున్నారుఇప్పుడు అది ఇక ఎంతమాత్రం ప్రయోగం కాదని శ్రీధర్ వెంబు చెబుతున్నారు. త్వరలో ఆయన సరికొత్త ఎడ్యుకేషన్ స్టార్టప్‌ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. శ్రీధర్ అంచనా ప్రకారం.. రాబోయే కొన్నేళ్లలో తన స్టార్టప్ ద్వారా రూరల్ ఇండియాలో 8,000 టెక్నాలజీ ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు, ఇకపై గ్రామాలు పట్టణాలకే ప్రపంచ స్థాయి సేవలు అందించే విధంగా ఎదుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సిలికాన్ వ్యాలీలో పెద్ద కంపెనీ వదిలేసి, అసలైన ఆనందం వెతుక్కుంటూ తమిళనాడులో చోటు చేసుకుంది.పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించమే కాకుండా అత్యాధునిక వసతులో హాస్పిటళ్లు నిర్మించడం, సాగునీటిని అందించడం, మార్కెట్లు, నైపుణ్య కేంద్రాల ఏర్పాటు స్థాపించాలని శ్రీధర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 

Related Posts