YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

లంచం అడిగిన రెవిన్యూ అధికారులు

లంచం అడిగిన రెవిన్యూ అధికారులు

సంగారెడ్డి అక్టోబరు 25,

లంచం అడిగిన రెవిన్యూ అధికారులు ఇల్లుకూల్చివేతకు నిరసనగా కుటుంబం ఆత్మహత్యాయత్నం బొల్లారం నిసిపల్ ఆఫీసు ముందు ఘటన సకాలంలో స్పందించిన స్థానికులు సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ ఆఫీస్ ముందు ఓ కుటుంబం ఆత్మాహత్యాయత్నానికి దిగింది. రెవెన్యూ సిబ్బంది లంచం అడిగి... ఇవ్వనందుకు ఇల్లు కూల్చివేత కు పాల్పడ్డారు. రెవిన్యూ అధికారుల తీరుకి నిరసనగా చింత ప్రభాకర్, లక్ష్మి, అక్షయ, తేజశ్రీలు  ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. ఇంటి పట్టాకోసం 30 వేలు లంచం అడిగారని, తామంత ఇవ్వలేమని ప్రాధేయపడ్డా పట్టించుకోలేదన్నారు. అధికారులు అవహేళనగా మాట్లాడారని బాధితులు వాపోయారు.
 

Related Posts