YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

కోవిడ్ వ్యాక్సిన్ కు వజ్ర బస్సులు

కోవిడ్ వ్యాక్సిన్ కు వజ్ర బస్సులు

మరో రెండు నెలల్లో కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న సంకేతాలు అందుతుంటడంతో ప్రజలందరికీ టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో నాలుగు కోట్లమంది ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందచేయవలసి ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా టీకా డోసులు ఎలా తరలించాలన్నిది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రధానంగా కోట్ల సంఖ్యలో తరలించే టీకాలను ఎయిర్ కండిషన్డ్ వాహనాల్లో మాత్రమే తరలించాల్సి ఉంటుంది. విమానాల ద్వారా వచ్చే సరుకును తెలంగాణలోని నలుమూలల్లోకి చేర్చేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలోని కార్గో బస్సులను వినియోగించటంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఎయిర్‌కార్గోలో మందులు, వ్యాక్సిన్‌ తరలింపునకు ఏసీ బస్సుల అవసరం ఉంది. వజ్ర బస్సులన్నీ ఎయిర్‌ కండీషన్‌ సదుపాయంతో ఉన్నవే. దీంతో వాటిని వాడాలని భావిస్తున్నారు. రెండురోజుల క్రితం తెలంగాణ ఆర్టీసీ జీఎంఆర్‌ ఎయిర్‌కార్గోతో ఒప్పందం చేసుకుంది. విమానాల ద్వారా వచ్చే సరుకును సంబంధిత గమ్యానికి చేర్చేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలోని కార్గో బస్సులను వినియోగించటం దీని ఉద్దేశం. ప్రస్తుతానికి మందుల సరఫరా సాధారణంగానే ఉన్నా, కోవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత భారీగా వాహనాల అవసరం ఉంటుంది. మరి అంత డిమాండును తట్టుకునేలా బస్సులు సిద్ధం చేయగల సామర్థ్యం ఉందా అని ఎయిర్‌కార్గో ప్రశ్నించింది. సాధారణ మందులకు 15– 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే సరిపోతుంది. కానీ వ్యాక్సిన్‌కు 4 డిగ్రీలలోపే ఉండాలి. దీంతో నిపుణుల ఆధ్వర్యంలో వజ్ర బస్సుల ఫిట్‌నెస్, ఏసీ పనితీరును పరిశీలింపచేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. వ్యాక్సిన్‌ విషయంలో ఈ బస్సుల ఏసీ సామర్ధ్యం సరిపోదని తేలితే.. ఇతర మందులు, పండ్ల సరఫరాకు వాడతారు. హైదరాబాద్‌లోని కాలనీల నుంచి వరంగల్, నిజామాబాద్, రామగుండం లాంటి పట్టణాలకు మినీ ఏసీ బస్సులను నడిపితే బాగుంటుందనే సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఆర్టీసీ దశలవారీగా వంద వజ్ర బస్సులను సమకూర్చుకుంది. కానీ జనాదరణ లేకపోవడంతో ఈ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కోవిడ్ టీకా తరలింపునకు వజ్ర బస్సులు అన్నిరకాలుగా సరిపోతాయని భావిస్తుండటంతో మూలనపడి ఉన్న వంద వజ్ర బస్సులకు డిమాండ్ పెరగనుంది.

Related Posts