YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

దిశపై హైకోర్టులో విచారణ

దిశపై హైకోర్టులో విచారణ

హైద్రాబాద్, నవంబర్ 16
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన దిశ సినిమా ఈనెల 26న విడుదల కానుంది. అయితే ఈ సినిమాను నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దిశ చిత్రాన్ని నిలిపివేయా లంటూ హైకోర్టులో రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుల కుటుంబ సభ్యులు ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ జుడిషియల్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో పెట్టిన దిశ ట్రైలర్ తొలగించాలని పిటీషనర్ కోరారు.దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి తమ కూతురు కు జరిగిన సంఘటన ను చిత్రం ద్వారా తీస్తున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు.ఈ చిత్రం విడుదల కావడం వలన తమ మనోభావాలు దెబ్బతింటు న్నాయని, ఒకవైపు జ్యుడీషియల్ కమిషన్ విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు చిత్రాన్ని ఎలా తీస్తారని, చిత్రాన్ని విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషనర్ కోర్టుకు తెలిపారు. చీఫ్ జస్టిస్ ధర్మాసనం పిటిషన్ పై నేడు విచారణ చేయనున్నారు.మరోవైపు దిశ ఎన్‌కౌంటర్ చిత్రం ఈ నెల 26న విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన ఈ సామూహిక హత్యాచారాన్ని ఆధారంగా తీసుకొని ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా ఇప్పటికే విడుదల చేశాడు.

Related Posts