YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

కరోనా పేషంట్ పై రేప్

కరోనా పేషంట్ పై రేప్

తిరువనంతపురం, నవంబర్ 18, 
కరోనాకి కూడా కామాంధులు భయపడడం లేదు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన మహిళను ఆస్పత్రి భవనం పైకి తీసుకెళ్లి నీచానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన కేరళలో జరిగింది.కరోనా మహమ్మారి సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళపై కన్నేశాడో కీచకుడు. ఆమెను డాక్టర్ పిలుస్తున్నాడంటూ పై అంతస్తుకి తీసుకెళ్లి రేప్ చేసేందుకు యత్నించాడు. ఎలాగో తప్పించుకున్న బాధితురాలు పరుగులు తీయడంతో విషయం వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన కేరళలో జరిగింది. కోజిక్కోడ్ జిల్లాలోని ఉల్లియెరిలో ఉన్న మలబార్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ పాజిటివ్ మహిళపై ఆస్పత్రి సిబ్బంది ఒకరు అత్యాచార యత్నం చేశారు.కోవిడ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న అశ్విన్ క్రిష్ణ(34) రోగుల రిజిస్టర్‌ నుంచి మహిళ నంబర్ తెలుసుకున్నాడు. ఆమెను డాక్టర్ రమ్మన్నారంటూ వాట్సాప్ మెసేజ్ పంపాడు. శరీరం సహకరించని ఆమె రాలేనని డాక్టర్‌కి కబురు పంపింది. కొద్దిసేపటికి నేరుగా ఆమె గదికి వచ్చిన అశ్విన్ డాక్టర్ రమ్మంటున్నారంటూ ఆమెను వెంటబెట్టుకెళ్లాడు. లిఫ్ట్‌లో ఎక్కించి నాలుగో అంతస్తుకి తీసుకెళ్లాడు. ఆమెను లిఫ్ట్‌ లోనుంచి బయటికి లాగి రేప్ చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు కంగుతింది.వెంటనే అప్రమత్తమైన ఆమె ఎలాగో కీచకుడి బారి నుంచి తప్పించుకుని కిందకు వచ్చేసింది. తోటి పేషెంట్లు, ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేయడంతో నిందితుడు అశ్విన్‌ని రిసెప్షన్ వద్ద నిర్బంధించారు. ఈ విషయం ఆస్పత్రి యాజమాన్యానికి తెలియడంతో నిందితుడిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని యాజమాన్యం తెలిపింది.

Related Posts