YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ముగిసిన నామినేషన్ల పర్వం

ముగిసిన నామినేషన్ల పర్వం

హైదరాబాద్‌ నవంబర్ 20
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. మూడు రోజులుగా అధికారులు నామినేషన్లు స్వీకరిస్తుండగా.. చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పలు పార్టీల నేతలు ర్యాలీగా వెళ్లి నామినేషన్లను అధికారులకు సమర్పించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముఖ్యనేతలు, శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు చేశారు. అభ్యర్థులతో జోనల్‌ కమిషనర్ కార్యాలయాలు కిటకిటలాడాయి. నిన్నటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లు దాఖలు చేయగా.. చివరి రోజు అత్యధికంగా 600కిపైగా నామినేషన్లు వచ్చినట్లు సమాచారం. మొత్తం నామినేషన్ల సంఖ్య వెయ్యికిపైగానే ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. కాగా, శనివారం అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు.కాగా అన్ని స్థానాలకు టీఆర్ఎస్.. అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ 26 మంది సిట్టింగ్‌లను మార్చగా, బీజేపీ 129 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 69 డివిజన్లలో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించలేదు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. నామినేషన్‌ పత్రాలు దాఖలకు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలన్నీ తుది జాబితాపై కసరత్తు మరింత వేగవంతం చేశాయి. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ సైతం పోటాపోటీగా గెలుపు గుర్రాల వేటలో వ్యహత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇతర పార్టీల్లో టికెట్‌ దక్కనివారిని చేరదీస్తున్నాయి.
 

Related Posts