హైద్రాబాద్, నవంబర్ 21,
ఇంటర్నెట్ ఫోన్ కాల్స్పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(వీవోఐపీ) కాల్స్తో పాటు కాలింగ్ యాప్స్ను గుర్తించేందుకు న్యూ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఇందుకోసం సీడాట్తో పాటు సాఫ్ట్వేర్ డెవలపర్స్తో కో ఆర్డినేట్ చేస్తున్నారు. టెలికం డిపార్ట్మెంట్తో కలిసి ఇంటర్నేషనల్ కాల్స్ డేటాను కలెక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వర్చువల్ నంబర్స్, వాటి దేశాల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ సహకారంతో ఇంటర్నేషనల్ కాల్స్ క్రైమ్ హిస్టరీని స్టడీ చేస్తున్నారు. దీంతో వర్చువల్ నంబర్స్, కాలింగ్యాప్స్తో ఫేక్ కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టవచ్చు.వాయిస్ ఓవర్ టెక్నాలజీతో ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తున్న నేరగాళ్ల క్రైమ్ డేటాను పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. కేస్ స్టడీస్ ఆధారంగా క్రిమినల్స్ మోడస్ ఆపరేట్తో తెలుసుకుంటున్నారు. లా ఎన్ఫోర్స్మెంట్తో కలిసి ఇంటర్నెట్ కాల్స్, స్పూఫింగ్ కాల్స్ను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో సైబర్ నేరగాళ్లు సుమారు50 దేశాలకు చెందిన కోడ్ సిరీస్తో వర్చువల్ ఫోన్ నంబర్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాలింగ్ యాప్స్తో కనెక్ట్ చేసి నేరాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించారు.ప్రపంచ వ్యాప్తంగా యూఎస్, యూకే నంబర్స్తో ఎక్కువగా వర్చువల్ కాల్స్ డెలివరీ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫ్రీ వర్చువల్ నంబర్స్తో కాలింగ్ యాప్స్ కనెక్ట్ చేస్తున్నారు. డీ యాక్టివేటైన ఇంటర్నెట్ కాల్స్కు సంబంధించిన లొకేషన్లు కనిపెట్టేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. నిందితుడి ఫోన్ నుంచి వెళ్లిన కాల్ టవర్ లొకేషన్, ఐపీ అడ్రెస్ ట్రేస్ చేసేందుకు స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సైబర్ ఎక్స్పర్ట్స్, సర్వీస్ ప్రొవైడర్స్తో కలిసి ఫేక్ కాల్స్ను గుర్తించేందుకు ప్లాన్ చేస్తున్నారు.