YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఆర్మీ ఆఫీసర్ అంటూ 17 మంది అమ్మాయిల ట్రాప్

ఆర్మీ ఆఫీసర్ అంటూ 17 మంది అమ్మాయిల ట్రాప్

హైదరాబాద్, నవంబర్ 21, 
ఆర్మీ ఆఫీసర్ నంటూ మహిళలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఆర్మీ ఆఫీసర్‌గా రిజిస్టరై పెళ్లి పేరుతో యువతులను ట్రాప్ చేసేవాడు. ఖరీదైర కార్లలో తిరుగుతూ వారిని నమ్మించి భారీగా డబ్బులు కాజేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఆర్మీ అధికారిగా చెలామణీ అవుతున్న శ్రీను నాయక్‌ని అరెస్టు చేశారు.హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ముదావత్ శ్రీను నాయక్ నేరేడ్‌మెట్‌లో స్థిరపడ్డాడు. తాను ఆర్మీ ఆఫీసర్‌నని.. మేజర్ ర్యాంకులో ఉన్నట్లు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లలో ప్రకటనలిచ్చి మహిళలను ట్రాప్ చేసేవాడు. ఆర్మీ యూనిఫాంలో ఖరీదైన కార్లలో తిరుగుతూ ఆర్మీ అధికారిగా నమ్మించేవాడు. ఇప్పటి వరకు 17 మంది మహిళలను ట్రాప్ చేసిన కేటుగాడు.. వారి నుంచి భారీగా డబ్బులు కాజేశాడు.సుమారు రూ.6.61 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాటితో విలాసవంతమైన జీవితం గడిపేవాడు. శ్రీను నాయక్ చేతిలో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేటుగాడి ఆటకట్టించారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు డమ్మీ పిస్టల్స్, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు నకిలీ యూనిఫామ్, ఐడీ కార్డ్స్, సర్టిఫికెట్లు, రూ.85 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Related Posts