YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

దేశ ప్రజలందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ : మంత్రి హర్షవర్ధన్

దేశ ప్రజలందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ : మంత్రి హర్షవర్ధన్

కరోనా మహమ్మారి జోరు దేశంలో ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. దీనికి తోడు దేశంలో బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్త కొరోనా స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే 30 వరకు కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో దేశ ప్రజలందరూ కూడా కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ..ఈ రోజు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ డ్రైరన్ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం తొలి దశలో భాగంగా డాక్టర్లు నర్సులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పోలీసులు పారిశుద్ధ్య కార్మికులకు 50 ఏళ్లు పైబడినవారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ వేయనున్నారు.
రెండో దశలో కోవిడ్ యాప్ ద్వారా సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తేనున్నారు. ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో జరుగుతున్న డ్రైరన్ను కేంద్రమంత్రి హర్షవర్ధన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు వద్దని అన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై నిపుణుల బృందం పర్యవేక్షిస్తుందని కరోనా వ్యాక్సిన్ త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ దేశమంతా ఉచితంగానే అందిస్తామని ప్రకటించారు. దిల్లీలో పలు ప్రదేశాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించిన తర్వాత అయన  ఈ ప్రకటన చేశారు. దిల్లీలోనే కాదు దేశమంతా ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తాం అని తెలిపారు.

Related Posts