YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దెందులూరు దగ్గర రోడ్డు ప్రమాదం

దెందులూరు దగ్గర రోడ్డు ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బస్సును బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బొలెరో వాహనంలోని ముగ్గురు యువకులు ఘటనస్థలంలోనే మృతి చెందారు. మృతులు భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన పర్సా రామకృష్ణ, వెలివేల గాంధీ, బలిన నరేంద్ర గా పోలీసులు గుర్తించారు. వీరు ఏలూరు వైపు నుంచి తమ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యువకులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్ దాటి రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇంద్ర బస్సును ఢీకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వాహనం నుంచి బయటకు తీశారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Related Posts