YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

భార్యను హతమార్చిన భర్త

 భార్యను హతమార్చిన భర్త

కె.పి.హెచ్.బి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్.ఎస్.కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్య పాలిట కాలయముడయ్యాడు. ఎస్.ఎస్. కాలనీలో నెల‌రోజుల క్రితం శేఖర్ అలియాస్ వేంకటేశ్వర్లు ఇంటి యజమాని రంగస్వామికి కాల్ చేసి ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. తరువాత తన‌ భార్య శ్రవంతితో కలిసి ఇంటిలో అద్దెకు దిగారు. తాను చెట్ల మందులు విక్రయిస్తానని శేఖర్ యజమానికి తెలిపాడు. కాగా మంగళవారం యజమానికి ఫోన్ చేసి తాను ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పి పరారయ్యాడు. ‌ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పని మనిషి ఇంటిలో మెట్ల కింద మూటలో శవం కనిపించటంతో యజమానికి సమాచారం అందించింది. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా శేఖర్ శ్రవంతిని తలపై బాది, చున్నీతో ఉరి బిగించి హత్య చేసాడని, మృతదేహాన్ని సంచిలో మూటకట్టి పరారయ్యాడని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Related Posts