YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ముక్కు ద్వారా వ్యాక్సిన్...?

ముక్కు ద్వారా వ్యాక్సిన్...?

హైదరాబాద్, జనవరి 9, 
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం ‘భారత్ బయోటెక్’ కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో ముందడుగు వేసింది. కొవిడ్-19 మహమ్మారి కట్టడికి త్వరలో ముక్కు ద్వారా వేసే చుక్కల మందు   తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ కి దరఖాస్తు చేసుకుంది. ఫిబ్రవరి-మార్చిలో మొదటి దశ వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఈ వ్యాక్సిన్ అభివృద్దికి సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ముక్కు ద్వారా ఒక్క డోసులోనే కరోనా వ్యాక్సిన్‌ను అందించే విధంగా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.భారత్ బయోటెక్ రూపొందించిన ‘కొవాగ్జిన్’ కరోనా టీకాకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌కు కూడా భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే.. ఈ రెండు టీకాలు కూడా సిరంజీ ద్వారా ఇచ్చేవి. పైగా ఒక్కో వ్యక్తికి రెండు డోసులు (28 రోజుల తేడాతో) ఇవ్వాల్సి ఉంది. ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టీకాలన్నీ రెండు డోసులవే. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ రూపొందించిన కొత్త వ్యాక్సిన్ గేమ్ ఛేంజర్ కానుంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ రెండు మోతాదుల్లో అందించాల్సి ఉంటుంది. అందుకోసం 2.6 బిలియన్ల సిరంజీలు అవసరమవుతాయి. అవి కాలుష్యానికి కారణం అవుతాయి. మేం రూపొందించిన కొత్త వ్యాక్సిన్ భారత్‌ తలపెట్టిన భారీ టీకా కార్యక్రమ వ్యయంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది’ అని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల అన్నారు.ముక్కు ద్వారా అందించే వ్యాక్సిన్‌పై భారత్‌, యూఎస్‌లో ఇప్పటికే నిర్వహించిన ప్రీ క్లినికల్ ప్రయోగాలు విజయవంతమయ్యాయని భారత్ బయోటెక్ తెలిపింది. వ్యాక్సిన్ వల్ల ఎదురయ్యే దుష్ర్పభావాలు, రోగ నిరోధకత, సవాళ్లను గుర్తించేందుకు ఈ ప్రయోగాలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మొదటి దశ మానవ ప్రయోగాలను ఫిబ్రవరి-మార్చిలో ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

Related Posts