YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష

పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి  వైయస్.జగన్ సమీక్ష

పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైయస్.జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.  టాయిలెట్ల నిర్వహణ, విద్యార్దుల హాజరు కోసం మొబైల్ యాప్పై సమీక్ష చేసారు. ఈ కార్యక్రమానికి  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. సీఎం మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లలో పరిశుభ్రమైన టాయిలెట్లు అందుబాటులోకి రావాలి. టాయిలెట్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ తయారుచేశామని అధికారులుతెలిపారు.  టాయిలెట్ నిర్వహణా నిధిపై రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, స్కూలు లేదా కాలేజీ స్థాయిలో కమిటీల ఏర్పాటుచేయాలి. టాయిలెట్ల నిర్వహణ అన్నది ప్రాధాన్యతా అంశం. టాయిలెట్ల లేకపోవడం, ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల చాలావరకు స్కూళ్లకు పిల్లలు పోలేని పరిస్థితి నెలకొంది. అందుకే మనం దీన్ని ప్రాధాన్యతా కార్యక్రమంగా చేపట్టామని అన్నారు. ఉత్తమ నిర్వహణా విధానాల ద్వారా పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఎప్పుడు మరమ్మతు వచ్చినా వెంటనే వాటిని బాగుచేసేలా చర్యలు ఉండాలి. శానిటరీ పరికరాలు, ప్లంబింగ్ సమస్యలు వస్తే వెంటే వాటిని బాగుచేయాలి. టాయిలెట్ల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వీటన్నింటిపైనా ఎస్ఓపీలను తయారు చేయాలి. విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. నాడు – నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇంగ్లిషు మాధ్యమం ద్వారా నాణ్యమైన బోధనను అందుబాటులోకి తీసుకు వచ్చాం. ఎవ్వరూ చేయలేని రీతిలో విద్యార్థుల పోషకాహారం కోసం గోరుమద్దను అమలు చేస్తున్నాం. అలాగే ఆరోగ్యకరమైన పరిస్థితులను స్కూళ్లలో తీసుకు రావడానికి టాయిలెట్ ఫండ్ను ఏర్పాటు చేసి... వాటిని పరిశుభ్రంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. రానున్న కాలంలో వీటి నిర్వహణ అత్యుత్తమంగా ఉండాలి. టాయిలెట్ల క్లీనింగులో వాడే రసాయనాల వినియోగంపై కూడా కేర్టేకర్లకు అవగాహన కల్పించాలి. టాయిలెట్ను ఒకసారి వినియోగించిన తర్వాత కచ్చితంగా క్లీన్ చేయాలి.  విద్యార్థులకు టాయిలెట్ల నిర్వహణలో సులభ్ లాంటి సంస్థల అనుభవాన్ని, వారి నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
పిల్లలు స్కూల్కు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లాలి. పిల్లలు స్కూళ్లకు రాని పక్షంలో వాలంటీర్తో యోగక్షేమాలు కనుక్కోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ దీనిపై పర్యవేక్షణ చేయాలి. ఫిబ్రవరి ప్రథమార్థంలో అన్ని తరగతులకూ స్కూళ్లు తెరిచే విషయమై ఒక ఆలోచన చేయాలని అన్నారు. రోజువారీ తరగతుల నిర్వహణపై కూడా ఆలోచన చేయాలలి. దీనిపై అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని అన్నారు. విద్యాకానుకకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. సకాలంలో విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకోవాలి. స్కూళ్లు తెరిచే నాటికి తప్పనిసరిగా విద్యాకానుక అందించాలి. వచ్చే విద్యా సంవత్సరంలో ఏడోతరగతి వారికి ఇంగ్లిషు మాధ్యమంలో బోధనపై దృష్టి పెట్టాలి సీఎం అన్నారు.

Related Posts