YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం దేశీయం

విషమంగా లాలు ఆరోగ్యం

విషమంగా లాలు ఆరోగ్యం

పాట్నా, జనవరి 23, 
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ఢిల్లీలో ఎయిమ్స్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం లాలూ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన శుక్రవారం రాంచీకి చేరుకున్నారు. కుమారుడు తేజస్వీ, భార్య రబ్రీదేవి తదితరులు రిమ్స్‌కు చేరుకుని, లాలూ ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనను ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యానికి గురైన ాయన ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్న లాలూను జైలులోని వైద్యుల బోర్డు నివేదిక అందిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించనున్నారు. ఆయనను ఢిల్లీకి తరలించడానికి జైలు అధికారులు కూడా కింది కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. మరోవైపు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను కలిసి తన తండ్రికి మెరుగైన చికిత్స అందజేయాలని కోరతానని ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ చెప్పారు.‘మా తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మెరుగైన చికిత్స అందజేయాలి.. కానీ, అన్ని నివేదికలు వచ్చిన తర్వాత ఆయనకు ఎటువంటి చికిత్స అందజేయాలనేది వైద్యులు విశ్లేషించాలి.. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌ను శనివారం కలుస్తాను’ అని తేజస్వీ మీడియాతో అన్నారు. ‘ఆయనకు ఇంతకు ముందే గుండె ఆపరేషన్ అయ్యింది.. కిడ్నీ కేవలం 25 శాతం మాత్రమే పనిచేస్తోంది... అలాగే న్యుమోనియా కూడా నిర్దారణ అయ్యింది.. ఊపిరితీసుకోవడంలో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు’ అని అన్నారు. పశుదాణా అక్రమాల కేసులో దోషిగా తేలిన లాలూయాదవ్ 2017 డిసెంబరు నుంచి జైలులో ఉన్నారు.

Related Posts