YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ నాయకుడు పట్టాభి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

టీడీపీ నాయకుడు పట్టాభి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

టీడీపీ నేత పై దాడి
విజయవాడ  ఫిబ్రవరి 2 
విజయవాడలో ని టీడీపీ నాయకుడు పట్టాభి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. అయన  ఇంటి నుండి కారులో బయటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.  దాడిలో గాయపడిన పట్టాభిని  చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.రాళ్లు, కర్రలతో జరిగిన ఈ దాడిలో అయన సెల్ ఫోన్ ధ్వసం అయింది. కారు అద్దాలు కు విరిగిపోయాయి. పట్టాభి మాట్లాడుతూ  వివిఐపి లు తిరిగే ప్రాంతంలో అల్లరి మూకలు విజృంభించాయి. నా పై అగంతకులు దాడిచేసి.. కారును ధ్వంసం చేశారు. ఆరు నెలల క్రితం నా పై దాడి చేస్తే కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకున్నారు. అందుకే ఇప్పుడు మళ్లీ నా పైదాడి చేశారు. పోలీసు కమిషనర్, డిజిపి స్పందించి ఇక్కడకి రావాలని అన్నారు. ప్రభుత్వ అవినీతి ని ప్రశ్నిస్తే చంపేస్తారా. నా ప్రాణం పోయే వరకు  నా గొంతు నొక్కలేరు. జగన్ రెడ్డి ప్రభుత్వం చేసే అవినీతి ని వెలుగులోకి తెస్తా. డిజిపి వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా. పోలీసులు వైఫల్యం, నిర్లక్ష్యం వల్లే నా పై తరచూ దాడులని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను అరెస్టు చేయాలని అయన అన్నారు.

Related Posts