YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

చంపేస్తారా...చంపేయండి : బాబు ఘాటు వార్నింగ్ఁ

చంపేస్తారా...చంపేయండి : బాబు ఘాటు వార్నింగ్ఁ

చంపేస్తారా...చంపేయండి : బాబు ఘాటు వార్నింగ్ఁ
విజయవాడ, ఫిబ్రవరి 2, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారనిచంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేత పట్టాభిపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడి అనంతరం పట్టాభిని విజయవాడలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సంఘటన గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.వైసీపీ నేతలు కళ్లు నెత్తికెక్కి ఏమైనా చేయగలమనుకుంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. పట్టాభిపై దాడికి సీఎం జగన్‌, డీజీపీ గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. పట్టాభికి వ్యక్తిగతంగా విరోధులు ఎవరూ లేరని, ప్రజల కోసమే పట్టాభి పోరాడుతున్నారని చెప్పారు. ‘‘చంపేస్తారా అందరిని? ఎంత మందిని చంపుతారు? చంపండి.. చూస్తాం.. ఖబడ్దార్, జాగ్రత్తగా ఉండండి! మీ ప్రాణం ఎంత ముఖ్యమో, మా ప్రాణాలు అంతే ముఖ్యం. జాగ్రత్తగా ఉండాలని వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి.. మీ బూతు మంత్రులకు ఇది సరికాదని చెప్పండి. వైసీపీ నాయకులు, కార్యకర్తలను ముఖ్యమంత్రి అదుపు చేసుకోవాలి’’ అని చంద్రబాబు అన్నారు.పట్టాభిపై మొదటిసారి దాడి చేసినప్పుడే చర్యలు తీసుకుంటే ఈరోజు పరిస్థితి వచ్చేది కాదని చంద్రబాబు అన్నారు. డీజీపీ గౌతం సవాంగ్‌ను దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది జగన్‌ కాదు.. ఇది ప్రజల సొమ్ము అని తేల్చి చెప్పారు. ‘‘ఏం చంపుతారా..? నన్ను కూడా చంపండి.’’ అంటూ విరుచుకుపడ్డారు. ప్రజలు కన్నెర్ర చేస్తే వైసీపీ నేతలు బయటకు కూడా రాలేరని హెచ్చరించారు. రాజ్యాంగం రాసిన అంబేడ్కర్‌ పేరుతో ఉన్న కాలనీలోనే ఈ దాడి జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని కలిసి మెమోరాండం ఇస్తారని, ఇలాంటి దాడులపై ప్రజలు కూడా ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వ పాలనలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే ఆడపిల్లల శీలానికి కూడా రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాలు, కోర్టులు, మీడియా ఉండకూడదని జగన్‌ భావిస్తున్నారని దుయ్యబట్టారు. విమర్శించే వారిని భయపెట్టడమే జగన్‌ వ్యూహమని, వైసీపీ బెదిరింపులతో ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని విమర్శించారు. వైసీపీ అరాచకాలకు నంద్యాల సలాం కుటుంబం ఆత్మహత్యే ఉదాహరణ అన్నారు. ఈ రోజు అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని, తూర్పు గోదావరిలో ఒకరిని హత్య చేశారని, ఇప్పుడు పట్టాభిపై దాడి అతి కిరాతకమన్నారు. పట్టాభిని హత్య చేయాలనే దాడి చేశారని చంద్రబాబు ఆరోపించారు.

Related Posts