YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి... కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి లేఖ

ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి...    కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్ ఫిబ్రవరి 4  
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన లేఖ రాశారు. తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ లేఖ తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తనకు ముప్పు పొంచి ఉందని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.గతంలో హైకోర్టు ఆదేశాలను సైతం తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖలో అమిత్ షా దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. గన్ మెన్లను సరిగ్గా కేటాయించడం లేదని విన్నవించారు.తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను సీఎంను మంత్రులను ఇలా అందరినీ డైరెక్టుగా ఎటాక్ చేస్తున్నారు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. ఏ విషయంలోనైనా నిలదీయడంలో ముందుంటారు. ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ రేస్ లో రేవంత్ రెడ్డి కూడా ఉండడంతో నిలదీస్తూ హీట్ పెంచుతున్నారు.కొత్త పీసీసీ ఇతర కమిటీలపై ప్రకటనకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్న సమయంలో రేవంత్ రెడ్డి రాసిన ఈ లేఖ కలకలం సృష్టిస్తోంది.

Related Posts