YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డ ఆదేశాలను పట్టించుకోను - పెద్దిరెడ్డి

నిమ్మగడ్డ ఆదేశాలను పట్టించుకోను - పెద్దిరెడ్డి

నిమ్మగడ్డ ఆదేశాలను పట్టించుకోను
తిరుపతి, ఫిబ్రవరి 6
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంత్రి పెద్దిరెడ్డిపై ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి. ఇంట్లో నుంచి బయటకు రాకుండా.. మీడియాతో మాట్లాడకుండా చూడాలని డీజీపీని ఆదేశించడం హీట్ పెంచింది. అయితే ఈ 
ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్యం, ప్రభుత్వంలో ఉన్న మంత్రిని ఇంట్లో పెట్టాలనే ఆలోచన చేయడం దుర్మార్గం అన్నారు. దేశంలోనే పెద్ద అధికారిలా నిమ్మగడ్డ ఫీలవుతున్నారని.. అఫ్ట్రాల్ ఆయనో రిటైర్డ్ ఐఏఎస్ 
అధికారి మాత్రమే అన్నారు. చంద్రబాబు దయతలచి ఇచ్చిన పదవిని దుర్వినియోగం చేస్తూ ఆయన కోసం బంట్రోతులా పనిచేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో నిమ్మగడ్డలా నీచమైన ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరూ 
లేరన్నారు మంత్రి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమని.. ఇలా చేస్తారని ముందే ఊహించామన్నారు. నిమ్మగడ్డ ఈ ఆదేశాలు ఇచ్చినా అమలవుతాయా లేదా అన్నది తెలుసుకోవాలి అన్నారు. ఆ 
ఆదేశాలను పట్టించుకోవల్సిన అవసరం లేదని.. నిమ్మగడ్డలా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనించి నిర్ణయం తీసుకోవాలన్నారు. 
ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని.. కాబట్టి ప్రజలు ఏకగ్రీవాలకు సహకరించాలన్నారు.ఏపీ ఎస్ఈసీ మంత్రి పెద్దిరెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని.. ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే 
పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.. అలాగే మంత్రికి మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలోశాంతి 
భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని డిజిపి కి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన ఫిర్యాదుకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన పత్రిక క్లిప్పింగులను జతచేశారు.. ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకే ఈ చర్యలని ఎస్ఈసీ 
తెలియజేయడం సంచలనంగా మారింది.

Related Posts