YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ కార్యకర్తపై దాడి

టీడీపీ కార్యకర్తపై దాడి

విజయనగరం ఫిబ్రవరి 8, 
గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీ కార్యకర్తలు పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గజపతినగరం మండలం మదుపాడ గ్రామానికి చెందిన ఎన్. సాంబయ్య అనే టీడీపీ కార్యకర్తకు చెందిన ఆటో పై మదుపాడ వైసీపీ కార్యకర్తలు  దాడికి పాల్పడి ద్వంసం చేసారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి సహకరించాలని సాంబయ్య ను   వైసీపీ కార్యకర్తలు కోరినట్లు సమాచారం. వైసీపీ కి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని చచ్చే వరకు టీడీపీలొనే ఉంటానని టీడీపీ కార్యకర్త సాంబయ్య చెప్పాడు. దాంతో సాంబయ్య పై కోపంతో ఆదివారం రాత్రి తన ఆటోను వైసీపీ కార్యకర్తలు ద్వంసం చేసినట్లు  సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు చేసాడు. బాధితుడు సాంబయ్య ను గజపతినగరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు సోమవారం ఉదయం పరామర్శించారు.

Related Posts