YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సంగారెడ్డిలో దొంగల హల్ చల్

సంగారెడ్డిలో దొంగల హల్ చల్

సంగారెడ్డిలో దొంగల హల్ చల్
సంగారెడ్డి ఫిబ్రవరి 10 
సంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు.  పుల్కల్ మండలం శివంపేట బస్టాండ్ వద్ద ఏపీజివిబి బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు దొంగలు చోరీకి యత్నించారు.  బ్యాంకు తాళం పగలగొట్టి సిసి కెమెరాలు ద్వంసం చేస్తుండగా.. అల్లారం సైరన్ మోగంతో దొంగలు పరరయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన  స్థానికులు బ్యాంకు బిల్డింగ్ ను చుట్టుముట్టి ఇద్దరు నిందితులను పట్టుకోగా.. మరొకరు పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో  సంఘటన స్థలానికి చేరుకున్న పుల్కల్ ఎస్సై నాగలక్మి  ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.      పట్టుబడ్డ నిందితులు సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన సురేష్, నర్సింలుగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.  ఈ ఘటనపై శివంపేట ఏపీజీవీబీ మేనేజర్, ఇతర సిబ్బంది మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో ముగ్గురు దొంగలు బ్యాంకులోని కిటికీ గుండా లోనికి ప్రవేశించి చోరీకి యత్నించారని తెలిపారు. అయితే ఎలాంటి దొంగతనం జరగలేదని అల్లారం మోగడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదన్నారు.
===========================XX

Related Posts