YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

లోకకల్యాణం కోసమే లలితాదేవి పారాయణం  ఆలయ ట్రస్టీ చెల్లెం స్వరూప 

లోకకల్యాణం కోసమే లలితాదేవి పారాయణం  ఆలయ ట్రస్టీ చెల్లెం స్వరూప 

లోకకల్యాణం కోసమే లలితాదేవి పారాయణం 
ఆలయ ట్రస్టీ చెల్లెం స్వరూప 
జగిత్యాల , ఫిబ్రవరి 10 
లోకకల్యాణం కోసం ప్రతివారం  లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నామని లలితా మాత ఆలయ ట్రస్టీ  చెల్లెం స్వరూప అన్నారు.  జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని 108శ్రీ చక్ర సహిత లలితమాత ఆలయనిర్మాణ ప్రాంగణంలో  బుధవారం మాతలచే లలితామాత సహస్రపారాయణం భక్తిశ్రద్ధలతో గావించారు. లలితామాత చిత్రపటాన్ని పూలు, పండ్ల దండలతో అలంకరించి మహిళలు ప్రత్యేక పూజలు గావించి ప్రసాదవితరణ చేశారు. ఈ సందర్బంగా మాతా స్వరూప మాట్లాడుతూ  సమాజంలో భక్తిభావం పెంపొందించేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. 
దేవునికి భక్తితో చేసే ప్రతిపూజ కుటుంబం తోపాటు సమాజంలో మార్పు తీసుకువస్తాయన్నారు.
గత సంవత్సరం అక్టోబర్ నేలలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయడం జరిగిందని అప్పటినుంచి ప్రతి బుధవారం ప్రాంగణంలో పారాయణం చేస్తున్నామని తెలిపారు. ఆలయానిర్మాణానికి ఇతోధికంగా విరాళాలుఅందించి సహకరించాలని స్వరూప కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ది అశ్విని, అర్చన, గంప పద్మ, సులోచన, పాంపట్టి జ్యోతి, ఆధ్యాత్మిక పరులు ఎన్నం కిషన్ రెడ్డి, కళాశ్రీ గుండేటి రాజు,  తదితరులు పాల్గొన్నారు.

Related Posts