YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఉప్పు చంద్రశేఖర్ నుంచి ప్రాణ హాని ఉంది మహా ప్రభో  విచారించి తగు న్యాయం చేయాలని వినతి

ఉప్పు చంద్రశేఖర్ నుంచి ప్రాణ హాని ఉంది మహా ప్రభో  విచారించి తగు న్యాయం చేయాలని వినతి

ఉప్పు చంద్రశేఖర్ నుంచి ప్రాణ హాని ఉంది మహా ప్రభో
 విచారించి తగు న్యాయం చేయాలని వినతి
నెల్లూరు ఫిబ్రవరి 10
నెల్లూరు గ్రామీణ మండలం, గుండ్లపాలెం మజారా పరిధిలోని వడ్డెపాలెం గ్రామానికి చెందిన ఉప్పు చంద్ర శేఖర్ నుంచి తమకు ప్రాణహాని ఉందని విచారించి రక్షించండి మహాప్రభో అంటూ సదరు గ్రామానికి చెందిన ఉప్పు నరసింహులు ఆయన భార్య ఉప్పు పార్వతి  అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితురాలు ఉప్పు పార్వతి మాట్లాడుతూ అంధురాలు అయినా నేను 2021 జనవరి 5న ఒంటరిగా ఇంట్లో ఉన్న ఆ సమయంలో తన మరిది అయినటువంటి ఉప్పు చంద్ర శేఖర్ దురుద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించి, నాపై లైంగిక దాడి చేయడమే కాకుండా, అతడి బలం కొద్దీ చేతులతో కాళ్లతో కొట్టాడని ఆరోపించారు. అదే సమయంలో మధ్యాహ్న భోజనానికి తన భర్త అయిన ఉప్పు నరసింహులు ఇంటికి రావడంతో ఆయనపై కూడా కలియబడి కొట్టడం జరిగింది అన్నారు. ఈ విషయమై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వారి సలహా మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందడం జరిగిందన్నారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడికి లోనైనా రూరల్ పోలీస్ అధికారులు కేసును నీరుగార్చారని ఆవేదనచెందారు. ఈ విషయమై రూరల్ డి ఎస్ పి కి ఫిర్యాదు చేసినప్పటికీ ఉప్పు చంద్రశేఖర్ను అరెస్టు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. మాకు  సంతానం లేనందున మాకు ఉన్న ఆస్తిని బలవంతంగా స్వాధీనం చేసుకొనుట చంద్రశేఖర్ మరియు అతని బంధువులు నన్ను నా భర్తను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని తన ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, విచారించి, ఉప్పు చంద్ర శేఖర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే తమకు వారి చేతిలో మరణం తప్పదని విజ్ఞప్తి చేశారు.

Related Posts