YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నా కుమారుడు మరణానికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

నా కుమారుడు మరణానికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

తన కుమారుడు మరణానికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని బాధితుడు ఎస్ కె రియాజ్ భాషా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ నందు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు ఎస్ కే రఫీ టిక్ టాక్ నందు దేశం నలుమూలల నుండి అత్యధిక అభిమానులు కలిగి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా మనుబోలు నేషనల్ హైవే కి సమీపంలో ఉన్న కాఫీ డే అను డాబా నందు టిక్ టాక్  ద్వారా పరిచయం అయినటువంటి నసీమా తో సోదరి భావంతో కలిసి టీ తాగినట్లు తెలుస్తోందన్నారు. ఈ విషయం తెలుసుకున్న నసీమా స్నేహితులు నా కుమారుడిని ఫోన్ చేసి తమ వద్దకు పిలిపించుకుని, అమ్మాయితో నీకేంటి పని అంటూ వారి అక్రమ ఆధీనంలో 3 గంటలు ఉంచుకొని, తీవ్రంగా అవమాన పరచడమే కాకుండా, చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా కొట్టారని తెలిపారు. ఈ విషయాన్ని స్థానికులు ద్వారా తెలుసుకొని మా అబ్బాయిని తీసుకొచ్చి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స అందించడం జరిగిందన్నారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేయగా వారిని అపరిచితులు గా భావించి కేసు నమోదు చేయడం జరిగిందని తన ఆవేదన వ్యక్తపరిచారు. ఈ క్రమంలో తన పై దాడికి పాల్పడినవారు ఫోన్ చేసి బెదిరించడమే కాకుండా , నిన్ను నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని బెదిరించడంతో, మనస్థాపానికి గురైన నా కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ పడి చనిపోవడం జరిగింది అన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అందుకు బాధ్యులైన వారిలో ముస్తఫా అనే వ్యక్తిని మాత్రమే అరెస్ట్ చేసి, మిగిలిన 6 మంది నేరస్థులను వదిలివేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నా కుమారుడు బలవన్మరణానికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వేడుకున్నారు.

Related Posts