YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో  అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.54.51లక్షల విరాళం

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో  అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.54.51లక్షల విరాళం

పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో  అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.54.51లక్షల విరాళం
జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  తో చిత్రాలు నిర్మిస్తున్న అయిదుగురు నిర్మాతలు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భూరి విరాళం చేశారు.  ఎ.ఎం.రత్నం (మెగా సూర్య ప్రొడక్షన్స్),  ఎస్. రాధాకృష్ణ (చినబాబు),  దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్),  నవీన్ ఎర్నేని (మైత్రి మూవీ మేకర్స్),  బండ్ల గణేష్ (పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్) కలసి రూ.54.51 లక్షల విరాళాన్ని అయోధ్య రామ మందిరం కోసం ఇచ్చారు.  పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూ.30 లక్షలు విరాళాన్ని చెక్కు రూపంలో తిరుపతిలో అందించిన విషయం విదితమే. ఆ స్ఫూర్తితోనే నిర్మాతలు విరాళం ఇచ్చారు. హైదరాబాద్ లో  పవన్ కళ్యాణ్  చేతుల మీదుగా నిర్మాతలు- ఆర్.ఎస్.ఎస్. తెలంగాణ ప్రాంత ప్రచారక్  దేవేందర్ జీ కి చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ బాఘ్ సంఘ్ చాలక్ డా. వేదప్రకాష్, నిర్మాత  ఎ.దయాకర్ రావు పాల్గొన్నారు.

Related Posts