YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

శారదాపీఠం కార్యక్రమంలో సీఎం జగన్

శారదాపీఠం కార్యక్రమంలో సీఎం జగన్

శారదాపీఠం కార్యక్రమంలో సీఎం జగన్
విశాఖపట్నం ఫిబ్రవరి 17
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ శారదా పీఠం వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదా పీఠంలో ముఖ్యమంత్రికి ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి, మంత్రులు స్వాగతం పలికారు. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర స్వామిలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణలో పాల్గొన్నారు.శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వార్షికోత్సవాలకు అంకురార్పణ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. దేశ రక్షణ, లోక కల్యాణార్థం రాజశ్యామల యాగం వేదోక్తంగా ప్రారంభమైంది. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.

Related Posts