YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

న్యాయ‌వాద దంప‌తుల హ‌త్య కేసును సుమోటోగా స్వీక‌రించిన హైకోర్టు

న్యాయ‌వాద దంప‌తుల హ‌త్య కేసును సుమోటోగా స్వీక‌రించిన హైకోర్టు

న్యాయ‌వాద దంప‌తుల హ‌త్య కేసును సుమోటోగా స్వీక‌రించిన హైకోర్టు
హైద‌రాబాద్ ఫిబ్రవరి 18 
న్యాయ‌వాదులైన గ‌ట్టు వామ‌న్‌రావు, పీవీ నాగ‌మ‌ణి దంప‌తుల హ‌త్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీక‌రించింది. ఈ హ‌త్య‌కు సంబంధించిన అన్ని ఆధారాలు ప‌క‌డ్బందీగా సేక‌రించాల‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ లోపు స‌మ‌గ్ర‌మైన నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఏజీని ఆదేశించిన హైకోర్టు.. ప్ర‌భుత్వానికి, పోలీసు శాఖ‌కు నోటీసులు జారీ చేసింది. హ‌త్య జ‌రిగిన చోట అన్ని ఆధారాల‌ను సేక‌రించి, కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలుపాల‌ని ఆదేశించింది. హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో అక్క‌డున్న ఆర్టీసీ బ‌స్సుల్లోని ప్ర‌యాణికుల‌ను గుర్తించి.. వాళ్ల‌ను సాక్షులుగా చేర్చాల‌ని కోర్టు తెలిపింది. హ‌త్యకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయ‌ని, వాటిని భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని సూచించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను మార్చి 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. 

Related Posts