YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

గ్యాలరీలను తనిఖీచేసిన అద‌న‌పు ఈవో

గ్యాలరీలను తనిఖీచేసిన అద‌న‌పు ఈవో

గ్యాలరీలను తనిఖీచేసిన అద‌న‌పు ఈవో

 
తిరుమల, ఫిబ్రవరి 18
తిరుమలలో శుక్రవారం రథసప్తమి ఉత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీలను టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తనిఖీ చేశారు.

            వాహనసేవలను వీక్షించేందుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉత్సవం జరిగేలా జాగ్రత్తలు వహించాలని టిటిడి ఇంజినీరింగ్‌, అన్నప్రసాదం, విజిలెన్స్‌ విభాగాల అధికారులకు అద‌న‌పు ఈవో పలు సూచనలు చేశారు. భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన తాగునీరు, అన్న‌ప్ర‌సాదాల పంపిణీ, మ‌రుగుదొడ్ల వ‌ద్ద పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

             అద‌న‌పు ఈవో వెంట టిటిడి ఎస్ఇ-2  నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ ఈవోలు  హ‌రీంద్ర‌నాథ్‌,  నాగ‌రాజ‌, ఆరోగ్య‌శాఖ అధికారి డాక్ట‌ర్ ఆర్‌.ఆర్‌.రెడ్డి, విజివో  బాలిరెడ్డి, క్యాటరింగ్‌ అధికారి  జిఎల్‌ఎన్‌.శాస్త్రి, ఎవిఎస్వో  గంగ‌రాజు త‌‌దిత‌రులు ఉన్నారు.

Related Posts