YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

అంతర్వేది లో సీఎం జగన్

అంతర్వేది లో సీఎం జగన్

అంతర్వేది లో సీఎం జగన్
కాకినాడ ఫిబ్రవరి 19 
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఏపీ సీఎం జగన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జగన్ కు  అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రథాన్ని సీఎం ప్రారంభించారు. ఈనెల 28 వరకు లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్స వాలు జరగనున్నాయి. గతేడాది సెప్టెంబరు 5న అంతర్వేదిలో స్వామివారి ఊరేగింపు రథం దగ్ధమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 95లక్షలతో 41 అడుగుల ఎత్తైన నూతన రథాన్ని చేయించింది. నూతన రథాన్ని సీఎం ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts