YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

గ్రేటర్ లో నలుగురు పిల్లల లెక్కలు

గ్రేటర్ లో నలుగురు పిల్లల లెక్కలు

గ్రేటర్ లో నలుగురు పిల్లల లెక్కలు

హైదరాబాద్, ఫిబ్రవరి 22
గ్రేటర్‌ హైదరాబాద్‌ కొత్త పాలకమండలి కొలువుతీరినా.. కొందరు  కార్పొరేటర్లపై అనర్హత కత్తి వేళ్లాడుతోందా? ఆ గండం నుంచి గట్టెక్కే దారులు ఉన్నాయా.. లేవా? వేటు పడితే కార్పొరేటర్‌ పదవి 
మూణ్ణాళ్ల ముచ్చటేనా? ఇంతకీ కార్పొరేటర్లకు పొంచి ఉన్న ఆపద ఏంటి? గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ముగిసిన రెండు నెలల తర్వాత గెలిచిన కార్పొరేటర్లు ఊరట చెందారు. పాలకమండలి కొలువు 
తీరడంతో హమ్మయ్య అని అనుకున్నారు. కానీ.. ఆ నలుగురు కార్పొరేటర్లు మాత్రం ఆందోళనతో ఉన్నారట. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి.. తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఎన్నికల్లో పోటీ చేసి 
గెలిచారన్నది వారిపై ఉన్న అభియోగం.ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులు. ఈ అంశంపై GHMC ఎన్నికల సమయంలోనే దుమారం రేగింది. ఘాన్సీ బజార్‌ బీజేపీ 
అభ్యర్థి, గాజులరామారం కాంగ్రెస్‌ అభ్యర్థిలపై ఇవే ఆరోపణలు రావడంతో.. వారి నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకుని పోటీ చేసినా ఓడిపోయారు. అది 
ముగిసిన అధ్యాయంగా అంతా భావించారు. కానీ.. గెలిచిన నలుగురు కార్పొరేటర్లపై ఇదే విధమైన ఆరోపణలు వెల్లువెత్తడంతో.. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు తలుపు తట్టారు ప్రత్యర్థులు. 
ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లలో ముగ్గురు బీజేపీ.. ఒకరు టీఆర్‌ఎస్‌కు చెందిన వారు ఉన్నారు. జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ వెంకటేష్‌, జాంబాగ్‌ కార్పొరేటర్‌ రాకేశ్‌ జైస్వాల్‌, హస్థినాపురం 
కార్పొరేటర్‌ సుజాతతోపాటు కుత్బుల్లాపూర్‌ కార్పొరేటర్‌  పారిజాతం ఈ జాబితాలో ఉన్నారు. పారిజాతం మినహా మిగతా వారు బీజేపీ కార్పొరేటర్లు. ఈ నలుగురికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు 
సేకరించామని చెబుతున్నారు ఓడిన ప్రత్యర్థులు. హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ పిటిషన్లపై  3నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఎన్నికల ట్రైబ్యునళ్లను ధర్మాసనం ఆదేశించింది. గతంలో ఇలాంటి 
ఆరోపణలు వస్తే కోర్టుల్లో విచారణ సంవత్సరాల తరబడి సాగేది. ఈలోగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి పదవీకాలం కూడా పూర్తయ్యేది. ఇప్పుడు హైకోర్టు 3 నెలల్లోనే విచారణ పూర్తి చేయాలని 
ఆదేశించడంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. గెలిచిన ఈ నలుగురు కార్పొరేటర్లకు ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్టు రుజువైతే అనర్హత వేటు పడుతుందని అధికార వర్గాలు 
అభిప్రాయపడుతున్నాయి. తమకు ఇద్దరు పిల్లలే ఉన్నారని అభ్యర్థులు అఫిడ్‌విట్‌ దాఖలు చేయడం.. ఉద్దేశపూర్వకంగా మోసం చేయడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ బీ 
ఫారాలు ఇచ్చినప్పుడు పార్టీ నేతలు ఏం చేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి రెడీమేడ్‌ ఆన్సర్లు ఆయా పార్టీల దగ్గర ఉన్నాయి. అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో వారికి ఇద్దరు పిల్లలు 
ఉన్నారా? ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అని చెక్‌ చేసే టైమ్‌ లేదని బదులిస్తున్నారు. తమ కార్పొరేటర్లు ఏం చెబుతారో విని కోర్టులో ఫైట్‌ చేస్తామని.. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వచ్చే అవకాశం 
ఉంటే.. రెండో స్థానంలో నిలిచినవారిని విజేతగా ప్రకటించకుండా మళ్లీ ఎన్నికలకు వెళ్లేలా ఆదేశించాలని కోర్టును కోరతామని వెల్లడిస్తున్నారు. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. అభియోగాలు 
ఎదుర్కొంటున్న కార్పొరేటర్లు మాత్రం టెన్షన్‌లోన ఉన్నారట. మరి.. కోర్టులు ఏం తేలుస్తాయో చూడాలి. 

Related Posts