YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మావోయిస్టుల ల్యాంగ్ మైన్ పేలీ ఒక జవాను కు గాయాలు

మావోయిస్టుల ల్యాంగ్ మైన్ పేలీ ఒక జవాను కు గాయాలు

మావోయిస్టుల ల్యాంగ్ మైన్ పేలీ ఒక జవాను కు గాయాలు
విశాఖపట్నం ఫిబ్రవరి 22 
విశాఖ జిల్లా ఏజెన్సీ ఏఓబి బోర్డర్ లో అలజడి రేగింది. కుంబింగ్ దళాలే టార్గెట్ గా మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈఘటనలో 160 బీఎస్ ఎఫ్  బెటాలియన్ కు చెందిన ధర్మేంద్ర సాహు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన హెలికాప్టర్ లో చికిత్స నిమిత్తం రాయపూర్ తరలించారు. ఏవోబీ లో గల మల్కన్ గిరి జిల్లా మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల దాల్ దాలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందుకున్న బీఎస్ ఎఫ్ జవాన్లు  ఆప్రాంతానికి కుంబింగ్ చేసుకుంటూ వెళ్లగా మావోయిస్టులు లాండ్ మైన్ పేల్చారు. వెంటనే తేరుకున్న జవాన్లు మావోయిస్టుల పై ఎదురు కాల్పులు జరిపారు. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ తప్పిచుకున్నారు. మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చిన ఘటన లో బీఎస్ ఎఫ్ 160 బెటాలియ న్ కు చెందిన ధర్మేంద్ర సాహు గాయ పడ్డారు. వెంటనే బీఎస్ ఎఫ్ హెలికాప్టర్ లో చికిత్స నిమిత్తం చిట్టిస్గఢ్ లో గల రాయపూర్ కు తరలించారు. తప్పిచుకున్న మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టారు.

Related Posts