అక్రమాలకు పాల్పడుతున్న సింగరేణి ఎండీ
మంచిర్యాల ఫిబ్రవరి 23
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో భాజపా నిర్వహిస్తున్న చత్రపతి శివాజీ సంకల్ప సభ కు వెళ్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర భాజపా ఇంచార్జ్ తరుణ్ చాంగ్ మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి కార్మికులు విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సింగరేణి ఎండి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపి జైలు కు పంపిస్తామని హెచ్చరించారు.