YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రోజా సీరియస్..ఐదుగరు సస్పెండ్

రోజా సీరియస్..ఐదుగరు సస్పెండ్

రోజా సీరియస్..ఐదుగరు సస్పెండ్
తిరుపతి, ఫిబ్రవరి 23,
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై అధిష్టానం సీరియస్‌ యాక్షన్ తీసుకుంది. సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుంది. నగరి నియోజకవర్గ పరిధిలోని ఐదుగురు వైఎస్సార్‌‌సీపీ నేతలపై అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. తడుకుకు చెందిన ముప్పాళ్ల రవి శేఖర్ రాజా, వై. బొజ్జయ్య పార్టీ నుంచి తొలగించింది. కేబీఆర్ పురానికి చెందిన తోటి ప్రతాప్, తొర్రురు పంచాయతీకి చెందిన యం.కిషోర్ కుమార్, గుండ్రాజు కుప్పం హరిజనవాడకు చెందిన రాజాపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ అభ్యర్థులను ఓడించాలని ప్రయత్నించినవారిని సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే రోజానే స్వయంగా తెలిపారు. వైఎస్సార్‌సీపీ జెండా, గుర్తులును కూడా పట్టుకోవడానికి వీల్లేదన్నారు. పార్టీ తరపున పనిచేయడానికి వీల్లేదన్నారు. ఎమ్మెల్యే రోజాతో పాటూ స్థానిక పార్టీ నేతల ఫిర్యాదుతో వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వైఎస్సార్‌సీపీలో ఈ పరిణామాలు జరిగాయి

Related Posts