YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

భారీగా పెరిగిన ఎడ్యుకేషన్ లోన్లు

భారీగా పెరిగిన ఎడ్యుకేషన్ లోన్లు

భారీగా పెరిగిన ఎడ్యుకేషన్ లోన్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 24, 
కిందటేడాది ఎడ్యుకేషన్ లోన్స్ రికార్డు లెవెల్లో పెరిగాయి. ఇండియాలోనే కాకుండా గ్లోబల్గానూ స్కూళ్లు, కాలేజీలు కరోనా కారణంగా మూసి వేసినప్పటికీ ఎడ్యుకేషన్ లోన్స్కి డిమాండ్ పెరగడం విశేషం. కరోనా వల్ల స్కూళ్లు, కాలేజీలన్నీ ఆన్లైన్ క్లాస్లకే పరిమితమయ్యాయి. బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ లెండర్లు కలిపి 2020 సెప్టెంబర్దాకా ఏడాది కాలంలో   ఇండియాలో మొత్తం రూ. 11 వేల కోట్లను ఎడ్యుకేషన్ లోన్స్గా ఇచ్చాయి. క్రిఫ్ హైమార్క్ క్రెడిట్ బ్యూరో ఈ డేటాను వెల్లడించింది. ఇందులో ఎక్కువ మొత్తం కరోనా టైము(మార్చి – అక్టోబర్ 2020) లోనే డిస్బర్స్ అయ్యాయని పేర్కొంది. ఈ టైములో 3 లక్షల మంది కొత్తగా ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకున్నట్లు తెలిపింది. అక్టోబర్ 2020 దాకా చూస్తే ఇండియాలో ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం ఎడ్యుకేషన్ లోన్స్ రూ. లక్ష కోట్లకు చేరాయి. ఇది కూడా రికార్డే.అదనపు అర్హతలను తెచ్చుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం పెరిగిందని, ఇందుకు కరోనా క్రైసిసే కారణమని లెండర్లు, ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఏదైనా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో చేరడమో లేదా షార్ట్ టర్మ్ అప్స్కిల్లింగ్ కోర్సులలో చేరడమో ఎక్కువైందని పేర్కొంటున్నారు. జాబ్ పోయే అవకాశం ఉండటంతో భయం ఎక్కువైందని, వర్క్ప్లేస్లో చోటు చేసుకున్న మార్పులూ కొంత ఆందోళన కలిగించాయని ఎక్స్పర్ట్స్ వివరిస్తున్నారు. దీంతోపాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ లేకపోవడం కూడా కొత్త కోర్సులలో చేరడానికి కారణమైందని అంటున్నారు. కెరీర్లో ముందుకెళ్లాలనే కోరికతో తమను తాము అప్గ్రేడ్ చేసుకోవాలనుకునే ప్రొఫెషనల్స్ పెరగడంతో టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్లో  అడ్మిషన్స్ బాగా ఎక్కువయ్యాయి. కిందటేడాది రూ. 50 లక్షలు ఆపైన ఎడ్యుకేషన్  లోన్స్ తీసుకోవడం తగ్గింది. కానీ, డొమెస్టిక్ కోర్సులు, అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కోసం లోన్స్ తీసుకోవడం పెరిగింది. దీంతో మొత్తం మీద చూస్తే ఎడ్యుకేషన్ లోన్స్ డిమాండ్ పెరిగిందని ఎడ్యువాంజ్ ఫైనాన్సింగ్ సీఈఓ వరుణ్ చోప్రా తెలిపారు. డొమెస్టిక్ ప్రోగ్రామ్స్ కోసం తీసుకునే ఎడ్యుకేషన్ లోన్స్ రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్యలో ఉంటాయి. భవిష్యత్లో కూడా ఈ చిన్న టికెట్ లోన్స్‌ పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు చోప్రా పేర్కొన్నారు. ఇచ్చే అప్పుకు కోలేటరల్ అడగడం మీద కంటే భవిష్యత్లో బారోవర సంపాదన ఎలా పెరుగుతుందనే దాని మీదే లెండర్లు దృష్టి పెడతారని అభిప్రాయపడ్డారు.  డొమెస్టిక్గా స్కిల్స్ పెంచుకోవాలనుకునే వారి సంఖ్యతోపాటు, ఓవర్సీస్ కోర్సులు చేయాలనుకుంటున్న వారి సంఖ్య ఈ ఏడాది 35 శాతం పెరిగిందని అవాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ అమిత్ గెయిండా అన్నారు.

Related Posts