YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

విజయసాయిరెడ్డి పాదయాత్ర చోరీ….అరెస్ట్

విజయసాయిరెడ్డి పాదయాత్ర చోరీ….అరెస్ట్

విజయసాయిరెడ్డి పాదయాత్ర చోరీ….అరెస్ట్
విశాఖపట్నం ఫిబ్రవరి 25
ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా విజ యసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్రలో పలు చోరీకి పాల్పడిన నిండుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నాయకులు ఈ నెల 20న నగరంలో  నిర్వహించిన పాదయాత్ర లో జేబు దొంగతనాలకు పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు క్రైమ్ డీసీపీ వి.సురేశ్బాబు తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్ప్లాంట్ వరకు నిర్వహించిన పాదయాత్రలో ద్వారకానగర్, తాటిచెట్లపాలెం, ఊర్వశి జంక్షన్, మర్రిపాలెం , ఎన్ఏడీ జంక్షన్ తదితర ప్రాంతాల్లో మనీ పర్సులు చోరీకి గురయ్యాయన్నారు. సుమారు 3,03,500 రూపాయిలు దొంగతనం జరిగినట్టు పలువురి నుంచి ఫిర్యాదులు రావడంతో అల్లిపురానికి చెందిన కింతలి రవికుమార్ను విచారించగా, జేబు దొంగల ముఠా గుట్టు రట్టైందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఇట్టా బాలాజీ, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పేరుపు దుర్గాప్రసాధ్, కృష్ణా జిల్లా నందిగామకు చెందిన కనగల శ్రీనివాస్లను  అదుపులోకి తీసుకుని విచారణ జరపగా,  వీరు నలుగురు నేరం అంగీకరించారని వివరించారు. నిందితుల నుంచి 2,80,000 స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

Related Posts