YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కిడ్నాపర్ల అరెస్ట్

కిడ్నాపర్ల అరెస్ట్

కిడ్నాపర్ల అరెస్ట్
అనంతపురం ఫిబ్రవరి 25 
అనంతపురం జిల్లాలో ఎరువుల వ్యాపారి కూతురి కిడ్నాప్ ప్లాన్ కలకలం రేపింది.నార్పలకు చెందిన ఎరువుల వ్యాపారి చంద్రశేఖర్ నాయుడికి కూతుర్ని కిడ్నాప్ చేస్తామంటూ కొందరు బెదిరింపులకు దిగారు.కోటి ఇవ్వాలని ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు.. ఎవరికైనా చెబితే అంతు చూస్తామని బెదిరిం చారు. వెంటనే ఎరువుల వ్యాపారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాప్ గ్యాంగ్ ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తోందని ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు.ఎరువుల వ్యాపా రికి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా కిడ్నాపర్ల గురించి ఆరా తీశారు. పక్కా ప్లాన్తో పోలీసులు వారిని ట్రాప్ చేశారు. వ్యాపారిని బెదిరించిన బాబావాలి, సుబ్బరాజు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో చంద్రశేఖర్ నాయుడు ఊపిరి పీల్చుకున్నారు. డబ్బుల కోసమే కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి పోలీసులు మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు.

Related Posts