YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మృతుల నుంచి బంగారం అపహరించిన 108 సిబ్బంది అరెస్టు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ

మృతుల నుంచి బంగారం అపహరించిన 108 సిబ్బంది అరెస్టు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ

మృతుల నుంచి బంగారం అపహరించిన 108 సిబ్బంది అరెస్టు
రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ
పెద్దపల్లి ఫిబ్రవరి 25 
పెద్దపల్లి జిల్లా రామగుండం మల్యాలపల్లి రహదారి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు బంగారం వ్యాపారులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటనలో మరణించిన వారి నుంచి రెండు కిలోల 300 గ్రాముల బంగారాన్ని అపహరించిన కమాన్పూర్ కు చెందిన 108 సిబ్బంది మెడికల్ టెక్నిషియన్ తాజోద్దీన్, డ్రైవర్ గుజ్జుల లక్ష్మారెడ్డి లను రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అరెస్టు చేశారు. ఈ మేరకు కమిషనరేట్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘటనకు సంబంధించి వివరాలను సీపీ వెల్లడించారు. సుమారు కోటిన్నర విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, నిందితులను జైలు కు పంపించారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాల్సిన 108 సిబ్బంది ఇలాంటి వ్యవహరానికి పాల్పడటం సరైన విధానం కాదని సీపీ సత్యనారాయణ అన్నారు. మీడియా సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Related Posts